Friday, June 6, 2025
E-PAPER
Homeసినిమాస్వచ్ఛమైన మనసుముఖ్యమని చెప్పే 'కుబేర'

స్వచ్ఛమైన మనసుముఖ్యమని చెప్పే ‘కుబేర’

- Advertisement -

ధనుష్‌-నాగార్జున హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కుబేర’. ఈ చిత్ర ఆడియో లాంచ్‌ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌, నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, జాన్వి నారంగ్‌, భరత్‌ నారంగ్‌, సిమ్రాన్‌ నారంగ్‌, సినిమాటోగ్రాఫర్‌ నికేత్‌ బొమ్మి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ తోట తరణి, లిరిక్‌ రైటర్స్‌ వివేక, చంద్రబోస్‌, నంద కిషోర్‌ పాల్గొన్నారు.
హీరోయిన్‌ రష్మిక మందన్న మాట్లాడుతూ,’తన సినిమా వరల్డ్‌లోకి నన్ను తీసుకొచ్చినందుకు శేఖర్‌ కమ్ములకి కతజ్ఞతలు. ఇది నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ ఫిల్మ్‌’ అని తెలిపారు. ‘అద్భుతమైన తారాగణం కలిసి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈనెల 20న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాము’ అని నిర్మాతలు చెప్పారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ, ‘ఇదొక ఒక అద్భుతమైన చిత్రం. ధనుష్‌, నాగార్జున పెర్ఫార్మెన్స్‌ మెస్మరైజింగ్‌గా ఉంటుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చి తంగా నచ్చుతుంది.’ అని హీరో నాగార్జున చెప్పారు. హీరో ధనుష్‌ మాట్లా డుతూ, ‘స్వచ్ఛమైన మనసు ముఖ్యం అని చెప్పే సినిమా ఇది. ఈ చిత్రం చూపే ఇంపాక్ట్‌ గురించి నాకు 2000% నమ్మకం ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -