- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలోని పాఠశాలను ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ బుధవారం సందర్శించారు. పిల్లల చదువుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం పాఠశాల చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్రాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారుతి, గ్రామ కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -


