Friday, April 17, 2026
E-PAPER
Homeమానవిరీఫ్రెష్‌గా యాక్టివ్‌గా...

రీఫ్రెష్‌గా యాక్టివ్‌గా…

- Advertisement -

వేసవిలో ఒకవైపు వేడి, చెమట కారణంగా చికాకుగా ఉంటుంది. ఏపని చేయాలన్నా విసుగ్గా ఉంటుంది. ఇక చర్మం చెమట పట్టి జిడ్డుగా మారుతుంది. దీంతో మొటిమలు, వేడి కారణంగా చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హాట్‌ సమ్మర్‌లో ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం…

రోజుకు రెండుసార్లు స్నానం చేయండి..
వేసవిలో రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయాలి. చాలామంది ఎండవేడి కారణంగా.. చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. దీని కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది. గోరు వెచ్చని నీటితో స్నానం చేసి.. చివర్లో రెండు మగ్గులు చల్లని నీరు పోసుకోండి. శరీర వేడి తగ్గడమే కాదు.. చాలాసేపు రీఫ్రెష్‌గా అనిపిస్తుంది.

సరిపడా నీళ్లు తాగండి..
ఈ కాలంలో చర్మం రిఫ్రెష్‌గా, శరీరం యాక్టివ్‌గా ఉండాలన్నా సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం, ఎండ వేడి కారణంగా నీరు చమట రూపంలో బయటకు వెళ్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. దీంతో చర్మం నిర్జీవంగా మారతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్‌, కొబ్బరి నీళ్లు , మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకుంటే మంచిది.

మాయిశ్చరైజర్‌ మర్చిపోవద్దు..
ఈ సీజన్‌లో చలి లేదు, చర్మం పగిలే సమస్య ఉండదని మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం మానేస్తూ ఉంటారు. వేసవిలోను మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్‌ చర్మంలో తేమను లాక్‌ చేస్తుంది. స్నానం చేసిన తర్వాత.. మాయిశ్చరైజర్‌ కచ్చితంగా అప్లై చేసుకోండి.

సన్‌స్క్రీన్‌ అప్లై చేయండి..
ఏ సీజన్‌లో అయినా బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. మరీముఖ్యంగా వేసవిలో దీన్ని అప్లై చేయడం అసలు మర్చిపోవద్దు. కాబట్టి బయటికి అడుగుపెట్టే ముందు కచ్చితంగా సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. బయటికి వెళ్లడానికి కనీసం 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవాలి.

జుట్టు వదలొద్దు..
ఈ సీజన్‌లో చెమట కారణంగా.. జుట్టు జిడ్డుగా మారుతుంది. చాలా మంది స్టైల్‌ కోసం.. జుట్టు లూజ్‌గా వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల గడ్డిలా డ్రైగా మారడమే కాదు.. మెడ మీద చెమట పడుతుంది. పోనీటెయిల్‌, జడ, ముడి పెట్టుకుంటే మీకు కంఫర్ట్‌గా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -