- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లుతో కలిపి డీలిమిటేషన్ ప్రవేశ పెట్టడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. 352 ఓట్లు రావాల్సి ఉండగా అనుకూలంగా 298, వ్యతిరేకిస్తూ 230 మంది విపక్ష సభ్యులు ఓటేశారు. మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. దీంతో ఆ తర్వాత సవరణతో పాటు మిగతా రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోడీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
- Advertisement -



