- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞాపూర్ ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సంయుక్తంగా మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజ్ఞాపూర్ మృతి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దనీ, మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -


