– పార్టీకి, ప్రభుత్వానికి మధ్య బంధం బలపడాలి
– రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై సుదీర్ఘ చర్చ
– సోషల్ మీడియాపై క్యాడర్కు కనీస అవగాహన లేదు
– దాన్ని ఉపమోగించడంలోనూ బలహీనం
– టీపీసీసీ ప్రకటన ఆలస్యంపై కార్యకర్తల్లో అసంతృప్తి
– సీఎం రేవంత్రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, టీపీసీసీ కమిటీల నియామకంపై చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వానికి మధ్య బంధం ఏ విధంగా ఉందనే విషయంపై చర్చించినట్టు తెలిసింది. పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా ముందుకు పోయేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరంపై సమాలోచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ చాలా బలహీనంగా ఉందని గుర్తించారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించడంలో చాలా బలహీనంగా ఉన్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొంత మంది నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియాపై కనీస అవగాహన కూడా లేదనే విషయాన్ని తేల్చారు. గత 10 రోజులుగా పార్టీ నేత లతో మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లోనే పార్టీ నాయకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్పై సీఎంతో మీనాక్షి చర్చించారు. వారు చెప్పిన సమస్యలు, అభిప్రా యాలను ముఖ్యమంత్రికి వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి… అలాగే అసెంబ్లీకి సంబంధించి నేతలతో ఉమ్మడి జిల్లాలకు కొంతమంది పర్యవేక్షకులను నియమించారు. వారందరితో వరుసగా పదిరోజుల పాటు సమీక్షా సమా వేశాలు నిర్వహించారు. ఈ విషయాలన్నీ రేవంత్రెడ్డికి ఆమె వివరించారు. చాలా మంది నేతలు జిల్లాలు, నియోజక వర్గా ల్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకు న్నారు. దాంతో పాటు ఆధిపత్యపోరుకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్టు వివరించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్ర మాలకు సంబంధించి వివరాలు తెలియవనీ, వాటిపై వారికి అవగాహన లేకపోవడంతో జనాలకు వివరించ లేకపోతున్నారని తేల్చారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల పాత నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని దీనికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య బంధం బలపడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES