- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కొడంగల్లో నేటి నుంచి సీఎం రేవంత్ రెండ్రోజుల పర్యటన ప్రారంభం కానుంది. హకీంపేట్లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించి, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి కొడంగల్లోనే బస చేయనున్న సీఎం, మంగళవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశమవుతారు. అర్హులందరూ ఓటర్లుగా నమోదు కావాలని సూచించడంతో పాటు, ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -



