- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని ఇందూర్తి గ్రామంలో మంగళవారం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 10 న జరిగే జైల్ భరో కు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న జైలు భరోను సిఐటియు అనుబంధ సంఘాల కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరి వెంకటయ్య,జంగిలి లింగయ్య,బొల్లోజువెంకటా చారి,శిఖలం మెట్ల యాదగిరి,గిరి సైదమ్మ,పగిలి నాగమ్మ,లపంగి మల్లమ్మ,వీరమల్ల నరసమ్మ,బొల్లోజు సత్తమ్మ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



