- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ పీఆర్టీయూ నూతన మండల కమిటీ కార్యవర్గం జిల్లా అధ్యక్షులు కుషాల్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మద్నూర్ మండల అధ్యక్షులుగా శివరాం, ఉపాధ్యక్షులు, శివాజీ, మరోతి, అనిత, పార్వతి, కార్యదర్శి రాజు, మహిళ కార్యదర్శి సరస్వతి, ప్రధాన కార్యదర్శి శివ శంకర్, అసోసియేట్ అధ్యక్షులు పండరి నాథ్, శివ ప్రభ, మహిళ, సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పట్టాభి, బీర్కూర్ పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
- Advertisement -



