- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్య సేవలందించడంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ప్రత్యేకాధికారి శ్రీనివాస్ ఎంపీడీఓ ప్రవీన్ తో కలిసి సందర్శించారు. జ్వరాలు, వైద్య పరీక్షలు, మందుల నిల్వల వివరాలను అధికారులు వైద్యాధికారి మాధురితో చర్చించారు. ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ సులోచన, ఎన్ఎంలు అనిత, సరోజన, ఆశా కార్యకర్తలున్నారు.
- Advertisement -



