- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట
మండల కేంద్రములో జేకే ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 82 వారాలుగా ఆదివారం జరిగే సంతకు వచ్చే చుట్టుపక్కల ఉన్న గ్రామాల, తాండాల ప్రజలకు జేకే ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆకలి తీరుస్తున్నారు. దీంతో పాటు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి రాగి అంబలి కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సేవ చేయడమే ట్రస్ట్ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుధాకర్ చారి పుట్టి అంజయ్య కృష్ణయ్య నిరంజన్ మహేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



