- Advertisement -
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కార్మికులు కీలక భూమిక పోషించారు. కాని దురదృష్టవశాత్తు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరించడంలో బోడి మల్లయ్య మాదిరిగా వ్యవహరించింది. తగిన గుణపాఠం శాస్తి జరిగింది. ఇప్పటి ప్రభుత్వం కూడా దురదృష్టవసాత్తు ఇదే వైఖరిని అవలంబించటం శోచనీయం. డి ఎ, పి అర్ సి, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు లాంటి న్యాయమైన, చట్టబద్ధమైన సమస్యలను ఇప్పటికైనా గుర్తించి పరిష్కరించటానికి చొరవ చూపాలని ఆశిస్తున్నామన్నారు.
- Advertisement -