- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆలేర్ పట్టణంలో గత 35 సంవత్సరాలుగా, స్త్రీ వైద్య నిపుణులుగా, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రభాకర్ ని, దినచర్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి చేతుల మీదుగా పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించారు.
అనంతరం ఆయనకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా నీలం పద్మా వెంకటస్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, శీను తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



