- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో ఓ కొలిక్కి రావొచ్చన్న అంచనాలతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 505 పాయింట్లు లాభపడి 78,493.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 24,353.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 92.93గా ఉంది.
- Advertisement -



