- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాసేపట్లో పాక్-భారత్ మధ్య హాట్లైన్ చర్చలు ప్రారంభంకానున్నాయి. ఈ భేటీలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ , పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. అయితే, ఈ భేటీలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పై చర్చించనున్నారు. అనివార్య కారణాల వల్ల ఇదివరకే ఈ చర్చలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
- Advertisement -