– 24 ఏండ్ల కిందటి పరువునష్టం కేసులో…
న్యూఢిల్లీ: ప్రస్తుత ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా 24 ఏండ్ల కింద నమోదు చేసిన ఒక పరువునష్టం కేసులో ప్రముఖ పర్యావరణ ఉద్యమవేత్త మేథా పాట్కర్పై ఢిల్లీ కోర్టు బుధవారం నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ ఈ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 8న జరిగిన ఈ కేసు గత విచారణలో మేథాప్కాటర్ ఏప్రిల్ 23న (బుధవారం) కోర్టుకు హాజరుకావాలని, ప్రొబేషన్ బాండ్లు, రూ లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. అయితే బుధవారం 70 ఏళ్ల మేథాపాట్కర్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. దీంతో జడ్జి ‘ఢిల్లీ పోలీస్ కమిషనర్ ద్వారా పాట్కర్పై నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేస్తూ’ ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ మే 3 నాటికి మేథాపాట్కర్ తమ ఆదేశాలను పాటించాలని జడ్జి స్పష్టం చేశారు. నర్మదా బచావ్ ఉద్యమం సమయంలో గుజరాజ్లో ఒక ఎన్జీఓకు సక్సెనా చీఫ్గా ఉన్నారు. ఆ సమయంలో తన పరువునకు నష్టం కలిగించే విధంగా మేథాపాట్కర్ వ్యాఖ్యలు చేశారని సక్సెనా ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
మేథాపాట్కర్పై నాన్బెయిలబుల్ వారెంట్
- Advertisement -