నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పుర్ ఆ రోజు ఉదయం 10 గంటలకు ర్యాంకులను వెల్లడించనుంది. 1.80 లక్షల మంది పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గత ఏడాది అడ్వాన్స్డ్లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరం(2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES