Saturday, May 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅదానీ గ్రూప్‌ అవార్డును తిరస్కరించిన సుకీర్తరాణి

అదానీ గ్రూప్‌ అవార్డును తిరస్కరించిన సుకీర్తరాణి

- Advertisement -

తమిళ దళిత కవయిత్రి సుకీర్తరాణికి ఇటీవల ఫిబ్రవరి 2025లో ‘దేవి అవార్డు’- ప్రకటించారు. ఆ అవార్డు ను స్పాన్సర్‌ చేస్తున్నది అదానీ గ్రూప్‌ అని తెలిసిన మరుక్షణమే – తను ఆ అవార్డును స్వీకరించ బోనని నిర్వాహకులకు తెలియజేశారు సుకర్తరాణి! మహి ళల పట్ల, దళితుల పట్ల చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ కొన్ని దశాబ్దాలుగా తను రాస్తున్న కవిత్యానికి, ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా నడుచుకోలేనని, అందుకే తిరస్కరి స్తున్నానని ఆమె ప్రకటించారు. టెలిగ్రాఫ్‌ లాంటి పత్రి కలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని పత్రికలు ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. బాధ్యతతో రచనలు చేసే ఏ సాహితీ వేత్తయినా వ్యక్తిగతంగా తన బాధలు మాత్రమే వ్యక్త పరచరని, సమాజానికి ప్రతినిధులుగా మారిపోయి రచనలు చేస్తారని, అందుకే వారి రచనలు జర్నలిస్ట్‌ రిపోర్టుల కన్నా అనేక రెట్లు బరువుగా, లోతుగా, గాఢంగా, శక్తివంతంగా ఉంటాయని అంటారు ఈ కవయిత్రి. దళిత మహిళా రచయిత్రులు ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో అర్రులు చాచడం లేదనీ – వ్యక్తులుగా వారి హక్కులు వారు సాధించుకో వడానికి మాత్రమే సంఘర్షిస్తు న్నట్టుగా అర్థం చేసుకోవాలని అంటారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుని, రోజువారీ కూలీల పొట్టగొట్టి, చెన్నై ఉత్తర దిశలో కట్టుపల్లి పొర్టును అదానీ గ్రూపు అక్రమంగా నిర్మిస్తోందని, అంతేగాక, హిండెన్‌ బర్గ్‌ రిపొర్టు వెల్లడై అదాన – మోడీ సంబంధాలు, అక్రమాలు ప్రపంచ వ్యాప్తమయ్యాయని అందువల్ల అదానీ స్పాన్సర్‌ చేసే అవార్డు వేడుకలో తను పాల్గొనడం, అవార్డు స్వీకరించడం అంటే- తనను తాను మోసం చేసుకోవడమే అవుతుందని ఆమె ప్రకటించారు.
అత్యంత ప్రతిభావంతులైన మహిళలను వివిధ రంగాల నుంచి ఎన్నిక చేసి దేవి అవార్డులిస్తారు. దళిత మహిళగా స్వయంగా ఆమె చూసిన జీవితంలోంచి, ఆమె జాతి జనులు ఎదుర్కొంటున్న సమస్యల్లోంచి కొన్ని దశాబ్దాలుగా ఆమె కవిత్వం రాస్తున్నారు గనక- దేవి అవార్డుకు ఎంపిక అయ్యారు. వత్తి పరంగా తమిళ ఉపాధ్యాయినిగా తమిళనాడులోని లాలాపేట్‌- రాణిపేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె పని చేస్తున్నారు. అంతేకాదు, సామాజిక కార్యకర్తగా, ఉద్యమనేతగా కూడా రూపు దాల్చారు. పాండిచ్చేరి మహిళా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి ఆధ్వర్యంలో 8 ఫిబ్రవరి 2025 ఏటీసీ గ్రాండ్‌, చోళా హోటల్‌, చెన్నైలో అవార్డు వేడుక జరుగుతుందని తెలిసినప్పుడు సంతోషిం చిన సుకీర్తరాణి, అది అదానీ స్పాన్సర్‌ చేస్తున్న అవార్డని తెలి యగానే, మనసు మార్చుకుని తిరస్కరించారు. దేవి అవార్డులను అదానీ, అహుజాలు ఇంకా వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీలు కలిసి నిర్వహిస్తున్నారని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వార్త చదవగానే వెంటనే ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ దోచుకుని దాచుకునే ప్రవత్తి గల అదానీ చర్యల్ని ఎక్కడికక్కడ నిరసించక తప్పదని ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దళితుల్ని, మైనార్టీలను కొట్టి చంపుతూ, మనువాద భావజాలాన్ని ప్రచారం చేసే ప్రభుత్య చర్యల్ని, కార్పొరేట్ల చర్యల్ని నరసించవల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.
యాభై రెండేండ్ల సుకీర్తరాణి ప్రకటించిన ఆరు కవితా సంపుటాల శీర్షికలు ఈ విధంగా ఉన్నాయి. 1. కై పథిరి ఎన్‌ కనవు కెల్‌ (నా చేయి పట్టుకుని నా కలల్ని విను) 2. ఇరవు మిరుగం (రాత్రి జంతువు) 3. అవలై మొజి పెయర్తళ్‌ (ఆమెను అనువదించు) 4. కామత్తి పో (కామ పుష్పం) 5. తీన్‌ డప్ప దాత ముత్తమ్‌ (అస్పశ్యతా ముద్దు) 6. ఇప్పడిక్కు ఎవల్‌ (నీ పండగ).
సుకీర్తరాణి లోగడ స్వీకరించిన అవార్డులు, గుర్తింపులు కొన్ని ఇలా ఉన్నాయి. దేవమగల్‌ కవితోవి అవార్డు, పుత్తుమై పిత్తన్‌ స్మారక అవార్డు, పెంగల్‌ మున్నాని వారి ఉమెన్‌ అఛీవర్స్‌ అవార్డు, అవ్వాయి అవార్డు, ద ఫెట్నా (ఖీజుుచీA) అవార్డు, సబాల్టరన్స్‌ అవార్డు మొదలైనవి. ఈమె కవితలు పలు భారతీయ భాషల్లోనే కాకుండా జర్మన్‌ భాషలోకి కూడా అనువాదమయ్యాయి. ‘కన్నడి మీన్‌’ అనే లఘు చిత్రానికి సుకీర్తరాణి కవితే ఆధారమయింది. అప్పాలిన్‌ ఒక మరధి (నాన్నగారి మతిమరుపు) అనే చిత్రంలో ఆమె పాత్ర కూడా ఉంది. వెల్లూరు జిల్లా లోని రాణిపేటలో నివాసముంటున్న సుకీర్తరాణి, అక్కడి బాలికల ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యా యురాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె దళిత జీవితంపై ఒక నవల రాసే పనిలో నిమగమై ఉన్నారు.
దేశంలో ఆరులక్షల గ్రామాలున్నాయని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. కానీ, సుకీర్తరాణి దష్టిలో దేశంలో పన్నెండు లక్షల గ్రామాలున్నాయి. అది ఎలాగా ? అంటే – ప్రతి గ్రామం దళితులు – దళితేతరులుగా విభజింపబడి ఉంది కాబట్టి, ప్రతి గ్రామాన్ని ఒకటిగా కాకుండా రెండుగా లెక్క వేసుకోవాలని ఆమె అంటారు. కులవివక్ష దేశంలో ఇంకా ఈ నాటికీ ఉంది. అది కాదనలేని సత్యం. చిన్న దళితవాడ ఒక వైపు ఉంటే, దళితేతరులు ఉండే ప్రధాన గ్రామం మరో వైపు ఉంటుంది. అలా వేరు వేరుగా కాకుండా, మనుషులంతా ఒకటే అనే భావనతో విభజనలు లేని గ్రామాల్ని చూడాలని ఒకప్పటి సంఘ సంస్కర్తలు కషి చేశారు. ఈనాటి సామాజిక కార్యకర్తలు కూడా ఆ దిశలో పనిచేస్తూనే ఉన్నారు. ఈ వివక్ష భరించలేకే సుకీర్తరాణి సామాజిక కార్యకర్త అయ్యారు. అందులో తను ఎదుర్కొన్న సమస్యలు, అనుభవించిన బాధల్లోంచి ఆమెలోని కవయిత్రి మేల్కొంది. పిల్లలకు పాఠాలు చెప్పడం ఆమె వత్తి అయితే, దళిత ఘోషను, స్త్రీవాద గొంతుకను, అంతరంగ సంక్షోభాన్ని అక్షరాలుగా మలుచుకోవడం ఆమె ప్రవత్తి అయింది!
బాల్యంలోనే సుకీర్తరాణికి కొన్ని అనుభవాలు ఎదుర య్యాయి. అవికొన్ని ప్రశ్నల్ని లేవనెత్తసాగాయి. ఆటల్లో గాని, సాంస్కతిక కార్యక్రమాల్లో గానీ, ఇంకా ఏ ఇతర కార్యక్రమా ల్లోనైనా పాఠశాలలో ఎందుకోగానీ దళిత పిల్లల్ని విడిగా ఉంచే వారు. వారితో ఎవరూ సరిగా మాట్లాడేవారు కూడా కాదు. ఈ విషయం చిన్నారి సుకీర్త మెదడులో ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తేది. అయితే ఒక అమ్మాయి సుకీర్తరాణితో కొంచెం చనువుగా మాట్లా డుతూ ఉండేది. ఒకరోజు ఆ ఆమ్మాయి తినడానికి చాక్లెట్‌ ఇచ్చిం ది. సుకీర్త సంతోషంగా తీసుకుని తినేసింది. ఓ రెండు రోజుల తర్వాత తనకు మళ్ళీ ఏదైనా తిరిగి ఇవ్వాలని, తల్లిని డబ్బులడిగి ఒక స్వీట్‌ కొనుక్కుని వెళ్ళింది. ఎంతో ప్రేమగా దాన్ని తన స్నేహి తురాలికి ఇవ్వాలని ప్రయత్నించింది. ఆమె మాత్రం ముఖం చిట్లించి, తీసుకోవడానికి తిరస్కరించింది. అంతే! ఆ సంఘటనతో సుకీర్త మనసు చిన్నబుచ్చుకుంది. అంతేకాదు, ఆ చిన్న మన సులో పెద్ద ప్రశ్నలు బుసలుకొట్టాయి. ఆమె ఇచ్చినపుడు తను తీసుకోగా లేనిది, తను ఇస్తే ఆమె ఎందుకు తీసుకోలేదూ? కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు తెలియని వయసు కదా అది? తజ్‌తపట్టా (అణగారిన వర్గాలు) అంటే ఏమిటీ? అని అందరిని అడుగుతూ ఉండేది!
ఇంటి పనులు కూడా ఆడ పిల్లలకు వేరుగా ఉంటున్నా యేమిటీ? ఇల్లు ఊడవడం, గిన్నెలు కడగడం, తిన్న తర్వాత అందరి ప్లేట్లూ తీయడం, అందరూ పడుకోవడానికి చాపలు పరవడం వంటి పనులన్నీ ఆడపిల్లలే ఎందుకు చేయాలో చిన్నారి సుకీర్తకు అర్థమయ్యేది కాదు. తన తల్లి కూడా మగ పిల్లలకు ఇలాంటి పనులు చెప్పేది కాదు. దుకాణానికి వెళ్ళినా వీరిని చూడగానే సేటు ముఖం మాడ్చుకునే వాడు. సరుకులూ చిల్లర డబ్బులూ పై నుంచే విదిల్చేవాడు. ఇంటా బయటా ఎందుకీ తేడాలూ? అందరూ ఒకటి కాదా? సమానం కాదా? అన్న ఆలోచ నలు ఆ బాలికలో పెరిగి, మహావక్షమయ్యాయి. అందుకే ఆమె క్రమంగా సామాజిక కార్యకర్త, ఉద్యమకారిణి, కవయిత్రీ కాగలి గింది. తను ఇంట్లో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఒక బాధ్యత గల పౌరురాలిగా ఉంటానని- ఇంటి బయట అడుగు పెట్టగానే కుల భావన తనని పిచ్చికుక్కలా వెంటపడుతుందనీ- ఇలాంటి క్షోభ తనలాంటి దళితులకు ఈ దేశంలో ఎందుకని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు.
సుకీర్తరాణి తండ్రి తాతలు ఫాక్టరీ వర్కర్లు. అయినా కూడా వారు పరిశుభ్రత పాటించేవారు. నిజాయితీగా బతికేవారు. అవే విధానాలు ఇంట్లో పిల్లలందరికీ నేర్పించేవారు. దళితులు అనగానే నీచమైన మురికి మనుషులు అని అందరూ అసహ్యించు కుంటారు. కానీ, వీరి కుటుంబం అ అభిప్రాయాన్నీ మార్చేసింది. ఎంత తెలివి ఉన్నా, ఎంత శుభ్రత పాటించినా బయట సమా జంలో మాత్రం వివక్ష ఆగేది కాదు. సుకీర్తరాణి తోడబుట్టిన వారు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లెలు. వారు మొత్తం ఆరుగురు. ఈమె పెద్దన్నయ్య పుస్తకాలు బాగా చదివే వాడు. తెలివైన పిల్ల అని గ్రహించి, చెల్లెలు సుకీర్తతో కూడా చది వించేవాడు. ఆ రకంగా ఆమె చదువు పట్ల, ఉన్నత విద్య పట్ల ఆకర్షింపబడింది. ఫలితంగా ఉపాధ్యాయినిగా, కవయిత్రిగా ఎదగగలిగింది.
ఎంతటి బలమైన, ప్రతిభావంతమైన కవిత్వం కాకపోతే సుకీర్తరాణి కవితలను ఢిల్లీ సాహిత్య విద్యార్థుల సిలబస్‌లో చేర్చు కుంటుంది? కవిత్యంలో ఆమెది ఏ స్థాయి అన్నది అక్కడే తెలు స్తుంది కదా? మహా రచయిత్రి మహాశ్వేతాదేవి, మరో తమిళ రచయిత్రి బామలతో పాటు సుకీర్తరాణి రచనలు కూడా ఢిల్లీ విశ్వ విద్యాలయ పాఠ్య గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి. అయితే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్లా తన మనువాద సనాతన భావజాలాన్ని అధికార బలంతో జోప్పిస్తూ ఉంది. ఇది ఒక బహి రంగ రహస్యం! అయితే ఇప్పుడు ఆ ముగ్గురి రచనలు 2021లో సిలబస్‌ నుంచి తొలగించారు. వెంటనే ప్రతిస్పందనగా నిరసనలు వెల్లువెత్తాయి. అరుంధతీరారు, విక్రమ్‌చంద్ర, నటీమణులు షబనా ఆజ్మీ, షర్మిలా టాగూర్‌ చిత్ర దర్శకులు ఆదూరి గోపాల కష్ణన్‌, ఆనంద్‌ పట్వర్థన్‌లు కలిసి ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏది ఏమైనా ఆ ముగ్గురు మహిళా రచయితల రచనలు సిలబస్‌లో కొనసాగించాల్సిందేనని గట్టిగా డిమాండ్‌ చేశారు. పత్రికల ద్వారా విషయం జన సామాన్యానికి తెలియజేశారు. శతాబ్దాలుగా స్త్రీలు శారీరక- మాన సిక క్షోభకూ, దోపిడీకి గురి అవుతూనే ఉన్నారు. అదే విషయం గొంతెత్తి ప్రశ్నించినందుకు సుకీర్తరాణి వంటి రచయిత్రుల రచనల్ని రాబోయే తరాలకు అందకుండా ఢిల్లీ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వం, సమాజంలోని ఒక వర్గం అడ్డుకుంటూ ఉంది. దాన్ని ఇప్పుడు మనమందరం నిరసించాల్సిన అవసరం వచ్చింది!!
త్రిపురనేని రామస్వామి జాతీయ పురసార తొలి గ్రహీత.

– డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -