Tuesday, April 29, 2025
Homeజాతీయంఅనకాపల్లి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి..

అనకాపల్లి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి శ్రీమతి అనితతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ‘‘అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది.’’ అనే విషయాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img