Monday, May 5, 2025
Homeజాతీయంఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

- Advertisement -

– అందులో ఇద్దరు తెలంగాణ, ఒకరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక హైకోర్టులకు చెందిన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన సమావేశాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజరు ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి ఒకరు, కర్ణాటక హైకోర్టుకు చెందిన నలుగురు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పెరుగు శ్రీ సుధను కర్నాటకకు, జస్టిస్‌ కాసోజు సురేందర్‌ను మద్రాస్‌ హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మథరావును కర్నాటక హైకోర్టుకు బదిలీ చేసింది. కర్నాటక హైకోర్టుకు చెందిన జస్టిస్‌ హేమంత్‌ చందన్‌ గౌడర్‌ను మద్రాస్‌ హైకోర్టు, జస్టిస్‌ కృష్ణన్‌ నటరాజన్‌ కేరళ హైకోర్టుకు, జస్టిస్‌ నెరనహళ్లి శ్రీనివాసన్‌ సంజరు గౌడను గుజరాత్‌ హైకోర్టుకు, జస్టిస్‌ దీక్షిత్‌ కృష్ణ శ్రీపాద్‌ను ఒడిశా హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -