నవతెలంగాణ-హైదరాబాద్: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందనే అనే వ్యాఖ్యలపై వివాదం మరువక ముందే..తాజాగా కమల్ హసన్ మరోసారి కీలక ప్రకటన చేశారు. కర్ణాటకలో థగ్లైఫ్ సినిమా(Thug Life Movie) విడుదల చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు. కన్నడను కించపరిచే ఉద్దేశం తనకు లేదు. రాదు కూడా అని ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)కి లేఖ రాశారు. తమిళం లాగే కన్నడకు కూడా సాంస్కృతిక నేపథ్యం ఉందని అన్నారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. అందరికీ అలాగే కన్వే చేస్తూ రెచ్చగొడుతున్నారని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు.. తప్పుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తినీ నేను కాదు.. అందుకే క్షమాపణ చెప్పాలని అనుకోవడం లేదని స్ఫష్టం చేశారు.
కన్నడలో థగ్ లైఫ్ సినిమాని విడుదల చేయకపోతే చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.20 కోట్ల వరకూ నష్టం వస్తుంది అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శింబు, త్రిష తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
కమల్ హాసన్ వ్యాఖ్యలపై కన్నడియులకు ఆగ్రహాం పెల్లుబికిన విషయం తెలిసిందే. దీంతో క్షమాపణ చెప్పకుంటే కమల్ సినిమాలను రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని, ఆయన సినిమాల ప్రదర్శనను నిలువరిస్తామని కన్నడ ఫిలిం చాంబర్ హెచ్చరించింది. స్పందించిన కమల్..తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయన సినిమాలపై కర్నాటక సర్కార్ నిషేధం విధించింది. ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. కమల్ హాసన్ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. క్షమాపణ చెపితే సమస్య పరిష్కరమువుతుందని, తప్పులు అందరూ చేస్తారని, సరిదిద్దుకోవాలని కోర్టు హితువు పలికింది. ఏ ఆధారంతో ఆ వ్యాఖ్యలు చేశారని, మీరేమన్న చరిత్రకారులా అని కమల్ హసన్ను ప్రశ్నించింది.