తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఇవాళ తెల్లవారుజాము నుంచి కాల్పుల మోత మోగుతోంది. వెంకటాపురం మండల పరిధిలోని కర్రిగుట్ట పై బాంబుల అమర్చామని, అటువైపు ఆదివాసీలు ఎవరూ రావొద్దంటూ ఇటీవలే మావోయిస్టుల నుంచి ఓ లేఖ విడుదలైన విషయం తెలిసిందే. ఇక కర్రిగుట్టలో ఓ కీలక నేత నేతృత్వంలో భారీగా మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నారనే సమాచారం మేరకు తెలంగాణ , ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసుల అధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు ‘బచావో కర్రిగుట్టలు’ పేరుతో భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. అయితే, ఛత్తీస్గఢ్ వైపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు వరుసగా కాల్పులు జరుపుతూ మావోయిస్టులను వెంబడిస్తుండగా.. వారంతా వేగంగా కర్రిగుట్ట వైపు కదులుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన భద్రతా బలగాలు కర్రిగుట్టను చుట్టుముట్టాయి. ఈ పరిణామంతో అక్కడి ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
‘కర్రిగుట్ట’పై కాల్పుల వినికిడి..?
- Advertisement -
RELATED ARTICLES