నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ తీరంలో 300కేజీల డ్రగ్స్ను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా. ఈ నెల 12-13న రాత్రి అనుమానాస్పద బోట్ కనిపించడంతో అధికారులు అక్కడికెళ్లారు. దీంతో దుండగులు డ్రగ్స్ మూటలను సముద్రంలో పడేసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, నేవీ దళం సంయుక్త ఆపరేషన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -