నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం మారణోమాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్ లోని సెంట్రల్ లాల్ చౌక్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తమ దుకాణ సముదాయల ముందు నల్లజెండాలు ఉంచి నిరసన వ్యక్తం చేసింది. ‘పర్యాటకులపై ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడం ఇదే తొలిసారి.పహల్గామ్లో జరిగిన హత్యలకు నిరసనగా మార్కెట్లోని అన్ని దుకాణాల ఎదుట మేము నల్ల జెండాలను ప్రదర్శించాము. బాధిత కుటుంబాలకు అండగా నిలువాలని, వారికి ఇది మా సంఘీభావాన్ని తెలియజేస్తుంది… పర్యాటకులపై ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడం ఇదే మొదటిసారి. ఇది చాలా దురదృష్టకరంష అని సెంట్రల్ లాల్ చౌక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫిరోజ్ అహ్మద్ బాబా అన్నారు.
- Advertisement -