నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. కస్మిక వరదలతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా పోయింది. భారీ వర్షాలు, వరదలతో 20-30కి పైగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతికూల వాతావరణ కారణంగా లేహ్ విమానాశ్రయం రన్వేను మూసివేసింది. ఈమేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. వర్షాలు కారణంగా పలు విమానాలు రద్దు చేశామని ప్రకటనలో రాసుకొచ్చింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా బుధవారం ప్రయాణ సలహా జారీ చేసింది, దీని ఫలితంగా లేహ్ విమానాశ్రయం రన్వే మూసివేయబడింది మరియు ఆగస్టు 27న విమానాలు రద్దు చేయబడ్డాయి. ఎయిర్ ఇండియా Xలో ఒక పోస్ట్ను షేర్ చేసింది, అది ఇలా ఉంది, “ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, లేహ్ విమానాశ్రయంలోని రన్వే ప్రస్తుతం మూసివేయబడింది, ఇది విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. తత్ఫలితంగా, ఆగస్టు 27న లేహ్కు మరియు బయలుదేరే మా షెడ్యూల్ చేసిన విమానాలు రద్దు చేయబడ్డాయి.”