- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీశ్ రావుతో కలిసి మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -