Wednesday, April 30, 2025
Homeజాతీయంనేడు ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్‌ భేటీ

నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్‌ భేటీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జమ్మూ కాశ్మీర్ పెహల్‌గామ్‌లో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌)ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ భేటీకి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి ఘటన తర్వాత సీసీఎస్‌ భేటీ కావడం ఇది రెండోసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది. ఈ సమావేశంలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్‌ జాతీయుల వీసా రద్దు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీసీఏ భేటీ తర్వాత ప్రధాని మోడీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) కూడా సమావేశం కానుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు సీనియర్‌ మంత్రులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img