నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలను హడావిడి లేకుండా విడుదల చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. ఈసారి ఫలితాల వెల్లడి కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు, అందుకు కొంత మొత్తం ఖర్చు చేయడం, రాజకీయ హడావిడి వంటివి లేకుండా నిర్వహించనున్నారు. గతంలో ప్రత్యేకంగా విలేకర్ల సమావేశాలు నిర్వహించడం వల్ల కొన్నిసార్లు ఫలితాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను https://resultsbie.ap.gov.inలో చూడవచ్చు

- Advertisement -