Wednesday, April 30, 2025
Homeజాతీయంపహల్గాం ఉగ్ర‌దాడిపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం

పహల్గాం ఉగ్ర‌దాడిపై ద‌ర్యాప్తు ముమ్మ‌రం

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: పహల్గాంలో ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తుండగా తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. బుధవారం మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఓ బృందం ఉగ్రదాది జరిగిన ప్రాంతానికి చేరుకుంది. కాగా, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంకు సమీపంలోగల బైసరాన్‌ లోయలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐదుగురు ముష్కరులు సైనికుల దుస్తుల్లో వచ్చి పర్యాకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుష పర్యాటకులను కాల్చిచంపారు. కాల్పుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img