నవతెలంగాణ-హైదరాబాద్: మంగళవారం మధ్యాహ్నం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి తాజా పరిస్థితిని తెలిసుకునేందుకు లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో మాట్లాడారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతోపాటు, జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ అధ్యక్షుడు తారిఖ్ కర్రాతో కూడా రాహుల్ మాట్లాడారు.
- Advertisement -