Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంపాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం

పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం

న‌వతెలంగాణ‌- హైద‌రాబాద్‌: పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు నోటీసు జారీ చేసింది. ఈ నోటామ్‌ కింద, ఏప్రిల్‌ 30 నుంచి మే 23, 2025 వరకు అన్ని పాకిస్తాన్‌-రిజిస్టర్డ్‌, సైనిక విమానాలకు భారత్‌ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాన్ని భారత గగనతలంలోకి అనుమతించరు. ఈ నిర్ణయం పాక్‌ ఎయిర్‌లైన్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పాకిస్థాన్‌ విమానాలు సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియా తదితర దేశాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. దీంతో దాయాది ఎయిర్ స‌ర్వీసుపై పెను ప్ర‌భావం ప‌డ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img