- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో విజయదశమి ఉత్సవాలు గురువారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని ఆర్య సమాజ్ నుండి భాజా భజంత్రీల ద్వారా జన సమూహంతో ర్యాలీ ద్వారా ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ గుట్ట ప్రాంతంలో ఉత్సవాల సభ రావణ దహన కాండ జరుపుకుంటారు. అనంతరం రావణ దహన కాండ చేశారు. ఉత్సవాలకు వేలాదిగా జనాలు తరలించారు. ఒకరినొకరు అలైబాలై చేసుకుంటూ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

- Advertisement -