Thursday, May 1, 2025
Homeజాతీయంమ‌రోసారి ఎల్‌ఓసి వద్ద పాక్ కాల్పులు..తిప్పికొట్టిన భార‌త్ ఆర్మీ

మ‌రోసారి ఎల్‌ఓసి వద్ద పాక్ కాల్పులు..తిప్పికొట్టిన భార‌త్ ఆర్మీ

న‌వతెలంగాణ‌- హైద‌రాబాద్‌: పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్‌ వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో ఎల్‌ఓసి రేఖ వెంబడి ఏప్రిల్‌ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతల‌కు కేంద్రంగా ఉండే కప్వారా, ఉరి, అఖ్నూర్‌ సెక్టార్లలో జరిగాయి. పాక్‌ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img