నవతెలంగాణ – హైదరాబాద్: విద్యుత్ షాక్తో భార్య కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి(D) ఇబ్రహీంపట్నంలో నివాసముంటున్న ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ కె.చేతన్రెడ్డి (26) భార్య బిందును మొయినాబాద్లోని లా కళాశాలలో గురువారం పరీక్షలు రాయించి బైక్పై ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో మామిడి కాయలను చూసి వాటిని కోస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
- Advertisement -