నవతెలంగాణ–కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థినీలు ప్రతిభ, ఆశ్రీత
రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీలకు ఎంపికైయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ తెలిపారు. 4వ తేదీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో జరిగిన ఎంపిక పోటీలలో విద్యార్థినిలు ప్రతిభ, ఆశ్రీత మంచి ప్రతిభ కనబర్చడంతో సెలెక్టర్లు ఇద్దరని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు.
సంగారెడ్డి లో ఈ నెల ఏడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీలలో పాఠశాల విద్యార్థినిలు ప్రతిభ, ఆశ్రీత పాల్గొంటారని తెలిపారు. ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలతో పాటు శీక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మాధురిని ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ, ఉపాధ్యాయులు అభినందించారు.



