Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెవిన్యూ సదస్సులతో రైతులకు ప్రయోజనం: ఎమ్మార్వో సంజీవ్ కుమార్ 

రెవిన్యూ సదస్సులతో రైతులకు ప్రయోజనం: ఎమ్మార్వో సంజీవ్ కుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల (భూ భారతి ఆర్ఓఆర్- 2025 చట్టం) ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మార్వో ఈ. సంజీవ్ కుమార్ అన్నారు. ఈ నెల 20 వరకు నిర్వహించనున్న రెవిన్యూ సదస్సులను మండలంలోని ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం దుబ్బాక మండల పరిధిలోని వెంకటగిరి తండాలో నిర్వహించిన సదస్సులో రైతుల నుంచి 83 ఆర్జీలను స్వీకరించామన్నారు. వీటిని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ లకు నివేదించి తగిన పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో వీఆర్వో రవి, రెవెన్యూ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -