నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే కాలంలో వికలాంగుల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టనున్నట్టు వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్పీఆర్డీ ఇండియా, స్పైనల్ కార్డు ఇంజూరి సంఘం, మరో పది సంఘాల ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా వికలాంగులకు ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలు బెంచ్ మార్క్ వైకల్యం 40శాతంకు అవకాశమిస్తూ జీవో 89 ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. వికలాంగులని వికలాంగులు పెండ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా మరో రూ.లక్ష ప్రోత్సాహమిస్తూ జీవో ఇవ్వటం చిన్న విషయం కాదన్నారు. సీఎం రేవంత్రెడ్డికి వికలాంగుల పట్ల ఉన్న చిత్త శుద్ధి ఇదేనని నిరూపితమైందని వివరించారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ ఇండియా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్పైనల్ కార్డ్ ఇంజురీ రాష్ట్ర అధ్యక్షుడు షఫీ, ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, బెస్త యాదగిరి, వి రాజశేఖర్, అడ్డా రాజు, ప్రవీణ, విజయ సింహారెడ్డి, మధు, రవి, జెర్రీ పోతుల నరసింహ, గంగారెడ్డి, భాస్కర చారి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు : ముత్తినేని సన్మానించిన వికలాంగుల సంఘాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES