- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2025 తుది ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అనుజ్ అగ్నిహోత్రి (Anuj Agnihotri) ఆలిండియా మొదటి ర్యాంక్, రెండో ర్యాంకు రాజేశ్వరి సువే, మూడో ర్యాంకును ఆకాన్ష్ ధూల్ కైవసం చేసుకుంది. కాగా, మే 25, 2025న ప్రిలిమ్స్ ప్రారంభమవగా ఆగస్టు 2025లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు జరిగిన పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఇవాళ తుది మెరిట్ లిస్ట్ను ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లు upsc.gov.in లేదా upsconline.nic.inలో చూసుకోవచ్చు.
- Advertisement -



