Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంసీఎం నితీష్‌ చ‌ర్య‌ను ఖండించిన రచయిత జావేద్‌ అక్తర్‌

సీఎం నితీష్‌ చ‌ర్య‌ను ఖండించిన రచయిత జావేద్‌ అక్తర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఓ మహిళా వైద్యురాలి హిజాబ్‌ను తొలగించడాన్ని గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ తీవ్రంగా ఖండించారు. ఆ వైద్యురాలికి నితీష్‌కుమార్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌మీడియా వేదికగా గురువారం ఆయన ఈ ఘటనను ఖండించారు. ”మహిళలు సాంప్రదాయకంగా పాటించే పరదా (ముసుగు)ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అంటే దానర్థం.. ఒక ముస్లిం వైద్యురాలి పట్ల నితీష్‌కుమార్‌ వ్యవహరించిన తీరుని ఎంతమాత్రం సమర్దిస్తానని కాదు. ఈ దుశ్చర్యను నేను అత్యంత కఠిన పదజాలంతో ఖండిస్తున్నాను. నితీష్‌ కుమార్‌ వెంటనే ఆ మహిళా వైద్యురాలికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి” అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఒక ముస్లిం మహిళా వైద్యురాలి పట్ల ప్రవర్తించిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పాట్నాలో సోమవారం 1400మంది ఆయుష్‌ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్‌ను హిజాబ్‌ను తొలగించాల్సిందిగా నితీష్ కుమార్ ఆదేశించారు. ఆమె తిరస్కరించడంతో హిజాబ్‌ను నితిష్‌ కుమార్‌ బలవంతంగా లాగారు. ఆయన పక్కన ఉన్న వారంతా ఈ చర్యను ఖండించడానికి బదులుగా నవ్వుతూ సమర్థించారు. ఈ చర్య సమంజసం కాదని ప్రతిపక్షాలు సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -