మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టీరియస్’. రోహిత్ సహాని (బిగ్ బాస్ ఫేమ్), అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా, శివాని నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’సౌత్లో ఉన్న అన్ని భాషలలో చేస్తున్న ఈ సినిమా పోస్టర్ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాం. షాకింగ్ ట్విస్ట్లు కథను కొత్త ఎత్తులకు తీసుకెల్లి వీక్షకులను రంజింప చేస్తుంది. యాక్షన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి’ అని దర్శకుడు మహి కోమటి రెడ్డి చెప్పారు.
నిర్మాత జరు వల్లందాస్ మాట్లాడుతూ, ‘క్లైమాక్స్ వరకు ఉత్కంఠ నింపడం ఈ చిత్రం మాస్టర్ క్లాస్ అని అన్నారు. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు రాజా అందించిన 3 పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి’ అని అన్నారు.
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ‘మిస్టీరియస్’
- Advertisement -
- Advertisement -