- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : 108 సిబ్బంది అంతర్జాతీయ పైలెట్ దినోత్సవ వేడుకలను సోమవారం 108 కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 108 అంబులెన్స్ వాహనాల ఉద్యోగులు విధి నిర్వహణలో పాల్గొని, మాట్లాడారు. ఆపద అనగానే ముందుగా గుర్తుకొచ్చేది 108 అంబులెన్స్ పగలనక రాత్రి ప్రమాద సమయంలో రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులను తరలించడంలో ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పైలెట్ మహేందర్ రెడ్డి, రాకేష్, ‘హీరోలాల్ ‘అభిలాష్, సాలయ్య, విశ్వం, శశికిరణ్, మహేష్, చిన్న కుమార్, సమీర్ లు పాల్గొన్నారు.
- Advertisement -