– 78 మంది తీవ్రంగా గాయపడ్డారు : పాక్ డీజీ ఐఎస్పీఆర్ వెల్లడి
లాహౌర్ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో తమకు జరిగిన నష్టాలను పాక్ మెల్లగా వెల్లడిస్తోంది. తాజాగా 11 మంది సైనికులు మరణించారు.. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలియజేసింది. ఇక పాకిస్తాన్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది మృతి చెందారని.. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్టు తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడినట్టు పేర్కొంది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. తమ దేశ ఎయిర్ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”భారత్తో జరిగిన సైనిక ఘర్షణల్లో వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైంది” అని వెల్లడించారు. అయితే, ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు. మరోవైపు భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఇటీవల మీడియా బ్రీఫింగ్స్లో మాట్లాడుతూ తాము పాక్ యుద్ధ విమానాలను కూల్చేసినట్టు ధ్రువీకరించారు. అయితే.. ఆ శకలాలు పాకిస్తాన్లోనే పడిపోయినట్టు చెప్పారు. కూలిపోయిన విమానం పాక్కు చెందిన మిరాజ్ కావచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
మా సైనికులు 11 మంది చనిపోయారు
- Advertisement -
- Advertisement -