- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరులో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. మటన్ తెచ్చేందుకు బైకుపై వెళ్తున్న 29 ఏళ్ల అక్షయ్పై చెట్టు కొమ్మ విరిగిపడి పడింది. అది నేరుగా తలపై పడటంతో అతడి పుర్రె 12 ముక్కలైంది. ఐసీయూలో ఐదు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం అతడు మృతి చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -