నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మేఘానిలో సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. ఈఘటనలో 133 మంది మరణించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రమాదంలో హాస్టల్ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు.