- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిరుద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలంటూ మంత్రి పిలుపునిచ్చారు. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క చెప్పారు.
- Advertisement -



