నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 15న కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. శంషాబాద్లోని నోవాటెల్లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చ ఉండనుంది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్లు సమాచారమిచ్చారు.
- Advertisement -