– రాంచీలో నీట మునిగిన ప్రయివేటు పాఠశాల
– సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రాంచీ: భారీ వర్షపాతం కారణంగా ప్రయివేట్ పాఠశాలలో చిక్కుకున్న సుమారు 162మంది విద్యార్థులను పోలీసులు రక్షించారు. జారండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. శనివారం భారీవర్షం కారణంగా లవ్కుష్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం నీట మునిగింది. 162 మంది విద్యార్థులు పాఠశాలలో చిక్కుకుపోయారని, వారంతా రాత్రంతా భవనంలోనే ఉండిపోయారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు భవనం పైకప్పుపైకి చేరి సహాయం కోసం అర్థించారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకు న్నారు. గ్రామస్తుల సహాయంతో విద్యార్థులను ఒక్కొక్కరిగా రక్షిం చామని పోలీస్ సూపరింటెండెంట్ (గ్రామీణ) రిషభాగార్గ్ తెలిపారు. విద్యార్థులను వారి ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు పాఠశాల మూసివేయనున్నామని అన్నారు.
162 మంది పిల్లల్ని కాపాడారు
- Advertisement -
- Advertisement -