Tuesday, March 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, మరో 73 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీగా మట్టి, రాళ్లు ఇళ్లపై పడటంతో 30కి పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలింపు కొనసాగుతోంది. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -