- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో బుధవారం దాదాపు 20 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 11 మందిపై రూ.33 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఒక్కొక్కరికి ప్రభుత్వ సాయం కింద రూ.50 వేలు అందించారు. అంతేకాదు వారికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.
- Advertisement -