- Advertisement -
న్యూఢిల్లీ: గేమింగ్ బ్రాండ్ అయినా అసుస్ ఇండియా కొత్తగా రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్ఓజీ), ఎన్విడియ ఆర్టిఎక్స్ 5000 సిరీస్తో శక్తివంతమైన 2025 ఆర్ఒజి ల్యాప్టాప్ శ్రేణిని ఆవిష్కరించినట్టు మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక పనితీరు గల ఆర్ఓజీ స్ట్రిక్స్ స్కార్ 16/18, స్ట్రిక్స్ జి 16, జెఫైరస్ జి 16, జెఫైరస్ జి 14, కన్వర్టిబుల్ ఫ్లో జెడ్ 13 ఉన్నాయని పేర్కొంది. వీటి ధరల శ్రేణీ రూ.2.79 లక్షల నుంచి రూ.4.49 లక్షలుగా ఉంది. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ లభిస్తాయని పేర్కొంది.
- Advertisement -